Friday, April 19, 2024

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..

దేశంలో కొత్త‌గా క‌రోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా 22,431 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో వెల్లడైన క‌రోనా కేసుల మొత్తం సంఖ్య 3,38,94,312కి పెరిగింది. నిన్న క‌రోనా నుంచి 24,602 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,32,00,258కి చేరింది. అలాగే, నిన్న 318 మంది క‌రోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,49,856కు చేరింది. ప్ర‌స్తుతం 2,44,198 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నారు. నిన్న దేశంలో 43,09,525 వ్యాక్సిన్ డోసులు వేశారు. దీంతో మొత్తం వినియోగించిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 92,63,68,608కి పెరిగింది. కేర‌ళ‌లో నిన్న 12,616 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 134 మంది క‌రోతో ప్రాణాలు కోల్పోయారు.

ఇది కూడా చదవండి: ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న ఏపీ గవర్నర్ దంపతులు

Advertisement

తాజా వార్తలు

Advertisement