Tuesday, April 16, 2024

దేశంలో కొత్తగా 31,443 మందికి వైరస్​

దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 31,443 కేసులు నమోదయ్యాయి. 118 రోజుల తర్వాత ఇంత తక్కువ మొతాదులో కేసులు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి. కొత్తగా 2,020 మంది కరోనాతో చనిపోయారు. రికవరీ రెటు 97.28 శాతానికి చేరింది. దేశంలో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 3,09,07,282కి చేరగా.. మరణాల సంఖ్య 4,10,784కి చేరింది.  ప్రస్తుతం భారత్‌లో 4,32,778 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 17,40,325 టెస్టులు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 43 కోట్ల 40 లక్షల 58 వేల 138 టెస్టులు చేశారు. కొత్తగా 40,65,862 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 38,14,67,646 వ్యాక్సిన్లు వేశారు.

ఇది కూడా చదవండి: రూ.50 కోట్లతో పీసీసీ పదవి కొన్నాడు: రేవంత్ పై కౌశిక్ సంచలన ఆరోపణ

Advertisement

తాజా వార్తలు

Advertisement