Friday, March 29, 2024

India Corona: భారత్ లో కరోనా ఖతం.. కొత్తగా 1096 కేసులే..

దేశంలో కరోనా ఉద్ధృతి పూర్తిగా తగ్గింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1096 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,28,131కు చేరింది. ఇక దేశంలో 81 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,21,345 కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1447 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంత దేశవ్యాప్తంగా రికవరీల సంఖ్య 4,24,93,773కు చేరింది. ప్రస్తుతం దేశంలో 13,013 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా పాజిటివిటి రేటు 87.77 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,84,66,86,260 కరోనా వ్యాక్సిన్లు డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement