Friday, April 26, 2024

TS పెండింగ్ బిల్లుల కేసులో.. కేంద్రంకు సుప్రీంకోర్టు నోటీసులు..

తెలంగాణలో కీలక పెండింగ్‌ బిల్లులను గవర్నర్ తమిళిసై తన దగ్గరే అట్టిపెట్టుకొని ఆమోదం తెలపకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా కేంద్రానికి సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో 10 కీలక పెండింగ్ బిల్లులపై సమాధానం చెప్పాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈనెల 27కు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement