Saturday, April 20, 2024

స‌మాధిలో ఉన్నా- కంగారు ప‌డొద్దు- నిత్యానంద‌

తాను స‌మాధిలోకి వెళ్లాన‌ని..శిష్యులు కంగారు ప‌డ‌వ‌ద్ద‌ని తెలిపారు వివాదాస్ప‌ద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద. ఈక్వెడార్కు సమీపంలోని ఓ ద్వీపంలో ఉంటున్న నిత్యానంద.. కొద్దిరోజుల కిందట అనారోగ్యంతో చనిపోయినట్లు వార్తలొచ్చాయి.ఈ వార్త‌ల‌పై స్పందించిన ఆయ‌న తాను బతికే ఉన్నానని.. 27 మంది డాక్టర్లు తనకు చికిత్స చేస్తున్నారన్నారు. అయితే ప్రస్తుతానికి మాట్లాడలేకపోతున్నట్లు ..మనుషులను గుర్తుపట్టలేకపోతున్నట్లు ఫేస్ బుక్ పోస్ట్ లో ఉంది. నేను చనిపోలేదు. ప్రస్తుతం సమాధిలో(సుప్తావస్థ) ఉన్నాను. నేను మరణించినట్లు కొందరు పుకార్లను వ్యాప్తిచేస్తున్నారు. నేను సమాధిలోకి వెళ్లాను. ప్రస్తుతం మాట్లాడలేకపోతున్నాను. అందుకు కాస్త సమయం పడుతుంది. మనుషులు పేర్లు ..ప్రాంతాలను గుర్తుపట్టలేకపోతున్నా. 27 మంది వైద్యులు నాకు చికిత్స చేస్తున్నారు.“ అని ఫేస్ బుక్ లో నిత్యానంద పేర్కొనడం గమనార్హం.

భారత్ లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న ఈ స్వామీజీ 50 సార్లు కోర్టుకు హాజరై.. 2019 నవంబర్ లో భారత్ వదిలి పారిపోయారు. ‘కైలాస’ అనేది నిత్యానంద ప్రపంచం. దానికి తనని తాను ప్రధానిగా ప్రకటించుకున్నారు. కైలాసను పత్యేక దేశంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితికి అభ్యర్థన కూడా చేసుకున్నారు. కొద్దిరోజులకు కైలాస డాలర్ ని తీసుకొచ్చారు.
తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసను కూడా ప్రారంభించినట్లు ప్రకటించారు. అయితే ఆయన ఎక్కడ ఉంటున్నారనే విషయం మాత్రం తెలియదు. కాగా కైలాస అధికారిక వెబ్సైట్.. రోజూ నిత్యానందకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంటుంది. ఫేస్ బుక్ లో ఫొటోలు వీడియోలను అప్డేట్ చేస్తుంటుంది. తాజాగా.. ఆయన ఫొటోలు సహా ఆయన పేపర్ పై రాస్తున్నట్లు ఉన్న చిత్రాలను షేర్ చేసింది. అయితే ప్రస్తుతం.. కైలాస ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిత్యానంద బతికి ఉన్నారా.. చనిపోయారా..అనేది మిస్టరీగా ఉంది. అధికారికంగా ఎవ‌రైనా స్పందిస్తే త‌ప్ప ఈ వార్త‌ల్లో నిజం ఏంటో తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement