Thursday, March 28, 2024

Pegasus Case: నిపుణుల కమిటీ ఏర్పాటుకు సిద్ధం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగసస్‌ స్పైవేర్‌ వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. పెగసస్‌పై స్వతంత్ర దర్యాప్తు జరపాలన్న పిటిషన్లపై ప్రధాన నాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. నిపుణుల కమిటీ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. పెగసస్​పై తాము ఇప్పటికే సమర్పించిన అఫిడవిట్ సరిపోతుందని, సవివరంగా మరో ప్రమాణపత్రం సమర్పించలేమని పేర్కొంది. కేంద్రం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా… దేశ భద్రత అంశాలు చర్చించడం మంచిది కాదనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంగా చెప్పారు. అయితే పెగసస్‌ అంశం అత్యంత ముఖ్యమైనదేని తెలిపారు. కేంద్ర ఏర్పాటు కమిటీ అన్నీ పరిశీలించి కోర్టుకు నివేదిస్తుందని చెప్పారు. దీంతో దేశభద్రత, శాంతి భద్రతల అంశాల్లోకి తాము వెళ్లడం లేదని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. పౌరుల గోప్యతకు సంబంధించిన విషయం, గోప్యత భంగంపై పిటిషన్లు వచ్చాయని చెప్పారు. కేంద్రం అఫిడవిట్ దాఖలు చేస్తే.. ప్రభుత్వ వైఖరేంటో తెలుస్తుందని సీజేఐ ఎన్.వి.రమణ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement