Wednesday, April 17, 2024

Big Breaking | ప‌ల్నాడులో బుస‌కొట్టిన ప‌గ‌.. కొబ్బ‌రిబోండాల క‌త్తితో ఇరువర్గాల దాడులు

పల్నాడు జిల్లాలో ప‌గ బుస‌కొట్టింది. పిడుగురాళ్ల పట్టణంలోని గంగమ్మ గుడి వేలంపాట ద‌గ్గ‌ర ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. దీంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్ర‌మంలో యలగాల వెంకట్రామయ్య(66) అనే వ్యక్తిని కొబ్బరిబోండాల కత్తితో మరో వర్గం వారు తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో గాయ‌ప‌డ్డ వెంకట్రామయ్య పరిస్థితి విషమంగా ఉంది. అత‌డిని హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా మరికొందరికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement