Thursday, April 25, 2024

South west mansoon : 48 గంటల్లో నైరుతి పలకరింత

నైరుతి రుతుపవనాలు త్వరలో కేరళను తాకనున్నాయి. భారత వాతావరణ విభాగం శుభవార్త చెప్పింది. మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని ప్రకటించింది. ఐఎండీ ప్రకటన.. మరో రెండు రోజుల్లో తొలకరి పలకరింపుతో దక్షిణాది ప్రజలు పులకరించపోనున్నారనే సంకేతాన్ని ఇచ్చింది. ఆ తర్వాత క్రమంగా అన్ని ప్రాంతాలకు మాన్‌సూన్‌ విస్తరించనుంది. ఏప్రిల్‌ నెల పూర్తిగా, మే నెల మొదటి వారంలో ఎండలు పెద్దగా లేకపోయినా తర్వాత క్రమంగా ఎండల తీవ్రత పెరిగింది. అయితే జూన్ మాసం మొదటి వారం పూర్తవుతున్న నేపథ్యంలో తొలకరి పలకరించనుందంటూ ఐఎండీ తీపి కబురు చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement