Tuesday, April 23, 2024

ప‌బ్ లో నేను లేను – నా పేరుని బ‌ద్నాం చేస్తున్నారు – న‌టి హేమ‌

హైద‌రాబాద్ బంజారాహిల్స్ ప‌బ్ లో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం రేగింది. ఈ కేసులో సినీ నటి హేమ పేరును కొన్ని వార్తా సంస్థలు ప్రసారం చేశాయి. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఎటువంటి సంబంధంలేని కేసులో తన పేరుని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. బంజారాహిల్స్ పీఎస్ కు వచ్చిన హేమ తనపై వస్తున్న వార్తలపై ఫిర్యాదు చేశారు. తాను పబ్ లో లేకపోయినా ఉన్నట్లు వార్తలు వచ్చాయని ఆవేదన చెందారు. తనపై తప్పుడు వార్తలు రాసిన ఓ న్యూస్ ఛానెల్ పై చర్యలు తీసుకోవాలని హేమ ఫిర్యాదు చేశారు. డ్రగ్స్ వాడిన వాళ్లని చెప్పుతో కొట్టాలి ..హైదరాబాద్ లో డ్రగ్స్ లేకుండా చేయాలి. సినిమా వాళ్లు ఫోకస్ అవుతారు కాబట్టే మాపై బురదజల్లుతున్నారు. హైదరాబాద్ డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలి. డ్రగ్స్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం(TS Govt) చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుంది. చిన్న పిల్లలు దగ్గర నుంచి గంజాయి, డ్రగ్స్ తీసుకుంటున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని నటి హేమ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement