Thursday, March 28, 2024

అక్ర‌మంగా రేష‌న్ బియ్యం నిల్వ‌లు.. దాడులు చేసి ప‌ట్టుకున్న విజిలెన్స్‌..

అల్వాల్ గ్రీన్ ఫీల్డ్ కాలనీలోని గోదాముల్లో భారీగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని విజిలెన్సు పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. కొన్నాళ్లుగా అక్రమంగా నిలువ ఉంచిన 60 టన్నుల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. దాదాపు రెండు లారీల లోడ్ తో ఉన్న 60 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.. పౌరసరఫరాల శాఖ అధికారులు దాడులు చేసే క్రమంలో అక్రమంగా వ్యాపారం చేస్తున్న కొందరు వ్యక్తులు అక్కడి నుండి పారిపోయారు..

విశ్వసనీయ సమాచారం మేరకు ఆల్వాల్ గ్రీన్ ఫీల్డ్ కాలనీ లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచి ఎక్కువ ధరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్న వారి పై దృష్టి సారించి పౌరసరఫరాల శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు.. రేషన్ బియ్యాన్ని పేద ప్రజలకు ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వ లక్ష్యాన్ని దెబ్బతీసే విధంగా అక్రమంగా గోదాముల్లో నిల్వ ఉంచి అమ్ముకుంటే కఠిన చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ అధికారి జగదీష్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement