Thursday, March 28, 2024

సిద్ధూకు పాకిస్థాన్ తో సంబంధాలు.. సీఎంగా ఒప్పుకోను

పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్… రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూపై సంచలన ఆరోపణలు చేశారు. సిద్ధూకు పాకిస్థాన్ తో సంబంధాలు ఉన్నాయని, అతడు పంజాబ్ ముఖ్యమంత్రి అయితే దేశ భద్రతకే ముప్పు అని వ్యాఖ్యానించారు. సిద్ధూకు పాక్ ప్రధానితోనూ, పాక్ ఆర్మీ చీఫ్ తోనూ స్నేహం ఉందని ఆరోపించారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ అసమర్థుడని, పంజాబ్ కు తదుపరి సీఎం సిద్ధూ అనే ప్రతిపాదన వస్తే కచ్చితంగా తిరస్కరిస్తానని అమరీందర్ స్పష్టం చేశారు. అతడు సీఎం పీఠం ఎక్కితే దేశానికే విపత్తుగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండిః పంజాబ్ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ రాజీనామా

Advertisement

తాజా వార్తలు

Advertisement