కరోనా వల్ల ఐఫా ఈవెంట్ 2021ని తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి మే నెలలో 19నుంచి 21వరకు నిర్వహించేందుకు సిద్దంకాగా ఆ దేశ అధ్యక్షుడు మరణించడంతో వాయిదా పడింది,దీంతో జూలై 14 నుంచి 16 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆ వాయిదాను ఆర్గనైజర్లు కాస్తా ముందుకు తీసుకొస్తూ తాజాగా కొత్త డేట్ ను అనౌన్స్ చేశారు. సినిమా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ప్రపంచాన్ని ఏకం చేస్తూ… ఐఫా 2022 కొత్త తేదీలను ప్రకటిస్తున్నాం. ఈవెంట్ జూన్ 2 నుండి 4 వరకు కొనసాగనుందని ఆర్గనైజర్లు తెలిపారు. 22వ ఎడిషన్ గా కొనసాగనున్న ఐఫా 2022 ఈవెంట్ ను బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్ ,రితీష్ దేశ్ముఖ్ .. మనీష్ పాల్ హోస్ట్ చేయనున్నారు. ఈవెంట్లో అత్యుత్తమ ప్రదర్శనకారులలో కార్తీక్ ఆర్యన్, రణవీర్ సింగ్, వరుణ్ ధావన్, సారా అలీ ఖాన్, దివ్య ఖోస్లా కుమార్, నోరా ఫతేహి .. అనన్య పాండే ఉన్నారు. ఈవెంట్ లో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా నటించిన ‘షెర్షా’ ఉత్తమ కథగా, ఉత్తమ నటులు, ఉత్తమ దర్శకుల నామినేషన్లలో ఒకటిగా ఉంది. రణవీర్ సింగ్-నటించిన ‘83’, అనురాగ్ బసు ‘లుడో’, ‘తాన్హాజీ : ది అన్సంగ్ వారియర్’, ‘తప్పడ్’ చిత్రాలు నామినేషన్ లో ఉన్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement