Thursday, April 18, 2024

Breaking: నా చివరి శ్వాస దాకా కేసీఆర్​తోనే ఉంటా.. మళ్లీ సొంతింటికి వచ్చినట్టుంది: దాసోజు శ్రవణ్​

ఏ ఆశయంతో బీజేపీలో చేరామో అవి నేరవేరలేదని.. పైగా ఆ పార్టీలో పెట్టుబడిదారులకే అవకాశాలు అన్నట్టుగా ఉందని విమర్శలు గుప్పించారు దాసోజు శ్రవణ్​. బీజేపీని వీడి రావడంతో తనకు సొంతింటికి వచ్చినట్టు ఫీల్​ అవుతున్నా అన్నారు. ఉద్యమంలో కేసీఆర్​ చేయిపట్టుకుని నడిచానని, ఇక మీదట సీఎం కేసీఆర్​ను వదిలి వెళ్లబోనని స్పష్టం చేశారు. తన చివరి శ్వాస దాకా కేసీఆర్​తోనే ఉంటానని చెప్పారు దాసోజు శ్రవణ్.

ఇవ్వాల (శుక్రవారం) బీజేపీ నుంచి టీఆర్​ఎస్​లో చేరిన సందర్భంగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు దాసోజు శ్రవణ్​. తనను మళ్లీ టీఆర్​ఎస్​లోకి వచ్చేలా చేసిన మంత్రి కేటీఆర్​కు కృతజ్ఞుడినై ఉంటానని, టీఆర్​ఎస్​లోకి రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. టీఆర్​ఎస్​ దేశానికే తలమానికంగా పనిచేస్తోందని, బీజేపీలో మోసపోయిన రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. ఎన్నో ఆశలతో బీజేపీలోకి వెళ్లామని, పెట్టుబడి నాయకులకు ప్రాతినిధ్యం వహించేలా ఆ పార్టీ తీరు ఉందని సీరియస్​ కామెంట్స్​ చేశారు శ్రవణ్​.

Advertisement

తాజా వార్తలు

Advertisement