Thursday, March 28, 2024

స‌న్నీలియోన్ పేరిట లోన్ – సిబిల్ స్కోర్ దెబ్బ తీశార‌ని ట్వీట్ చేసిన న‌టి

త‌న పాన్ కార్డు సాయంతో తెలియ‌ని వ్య‌క్తులు లోన్ తీసుకున్నార‌ని బాలీవుడ్ న‌టి స‌న్నీలియోన్ వెల్ల‌డించింది. ఎవరో ఇడియట్ నా పాన్ కార్డు సాయంతో రూ.2,000 రుణం తీసుకున్నాడు. నా సిబిల్ స్కోరును దెబ్బతీశాడు. ఈ విషయంలో ఐవీఎల్ సెక్యూరిటీస్ (ధనిస్టాక్స్) (పూర్వం ఇండియా బుల్స్ సెక్యూరిటీస్) నాకు సాయం చేయలేదు. ఇండియాబుల్స్ దీన్ని ఎలా అనుమతిస్తుంది’’ అంటూ సన్నీ లియోన్ ట్వీట్ చేసింది. నిజానికి సన్నీ లియోన్ ఒక్కరే బాధితురాలు కాదు. నిత్యం వందలాది మోసాలు ఇలానే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఐవీఎల్ సెక్యూరిటీస్ వంటి డిజిటల్ యాప్స్ ను మోసగాళ్లు వేదికలుగా చేసుకుంటున్నారు.

అయితే, సన్నీ లియోన్ తన ట్విట్ ను తర్వాత తొలగించడంతో కొందరు యూజర్ల నుంచి విమర్శలు ఎదుర్కొంది. ముందు ట్వీట్ ను తొలగించడానికి కారణం తన సమస్య పరిష్కారమైనట్టు సన్నీ చెప్పింది. ‘‘ఐవీఎల్ సెక్యూరిటీస్, ఐబీ హోమ్ లోన్స్, సిబిల్ కు ధన్యవాదాలు. వేగంగా నా సమస్యను పరిష్కరించారు. మరోసారి ఇది పునరావృతం కాదని భావిస్తున్నాను. ఇదే విధమైన సమస్య ఇతరులకు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటారని ఆశిస్తాను. చెత్త సిబిల్ స్కోర్ ను ఎవరూ కోరుకోర‌ని తాజాగా ట్వీట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement