Wednesday, April 24, 2024

Big Breaking | లాహోర్ లో హైడ్రామా.. పాక్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధం

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తోష్ ఖానా కేసులో ఇమ్రాన్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దాంతో లాహోర్ లోని ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్దకు భారీగా పోలీసులు తరలి వచ్చారు. అటు, పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇమ్రాన్ ఇంటి వద్ద ఉద్రిక్త ప‌రిస్థితి ఏర్పడింది.

ఈ కేసుతోపాటు న్యాయమూర్తి జెబా చౌదరిని బెదిరించిన కేసులోనూ ఇమ్రాన్ ఖాన్ పై మరో నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది. తోష్ ఖానా కేసులో ఆయన మార్చి 18న కోర్టులో హాజరు కావాల్సి ఉంది. ఇక‌.. జెబా చౌదరి కేసులో కూడా మార్చి 29న కోర్టుకు రావాల్సి ఉంది. తనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చిన నేపథ్యంలో, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్ వీడియో సందేశం వెలువరించారు. యావత్ దేశం ఏకతాటిపై నిలవాల్సిన అవసరం ఉందని, చట్టాన్ని పరిరక్షించుకునేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement