Thursday, April 25, 2024

Alert | ట్యాంక్​ బండ్​ ఏరియాలో ఆంక్షలు.. రేపు మధ్యాహ్నం నుంచి ట్రాఫిక్ మళ్లింపు!

హైదరాబాద్​ సిటీ ప్రజలకు ట్రాఫిక్​ అలర్ట్​.. ట్యాంక్​ బండ్​ పరిసర ప్రాంతాల్లో రేపు ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించి ఆ రూట్​లో జర్నీ చేసేవారు జాగ్రత్తగా ఉండాలని, ట్రాఫిక్ మళ్లింపును గమనించి ప్రయాణాలను సెట్​ చేసుకోవాలని పోలీసులు తెలిపారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ట్యాంక్‌బండ్‌ వద్ద టీఎస్‌ఆర్‌టీసీ లగ్జరీ బస్సు ప్రారంభించనున్నారు. దీనికోసం సిటీ పోలీసులు శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించారు. డిసెంబర్ 24 మధ్యాహ్నం 12:00 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.

  • ‌‌రాణిగంజ్ నుండి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలకు అనుమతి ఉండదు. సెయిలింగ్ క్లబ్ వద్ద కవాడిగూడ ఎక్స్ రోడ్స్, DBR మిల్స్ వైపు ట్రాఫిక్​ మళ్లించనున్నారు. ఇక.. లిబర్టీ నుండి ఎగువ ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే ప్రయాణికులను అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుతల్లి, ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు.
  • తెలుగుతల్లి నుంచి ఎగువ ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే వారిని అంబేద్కర్ విగ్రహం వద్ద లిబర్టీ, హిమాయత్ నగర్ వైపు మళ్లిస్తారు. అదేవిధంగా, డీబీఆర్​ మిల్స్ నుండి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ డీబీఆర్​ మిల్స్ వద్ద గోసాల, కవాడిగూడ, జబ్బార్ కాంప్లెక్స్, బైబిల్ హౌస్ వైపు మళ్లించనున్నారు.
  • ఇక్బాల్ మినార్ నుండి ఎగువ ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే ప్రయాణికులు పాత సెక్రటేరియట్ వద్ద తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు. లోయర్​ ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
Advertisement

తాజా వార్తలు

Advertisement