Monday, April 15, 2024

ప్రయాణికులకు గమనిక.. రేపటి నుంచి మెట్రోరైలు సమయాల్లో మార్పులు

హైదరాబాద్ నగరాన్ని గత మూడు రోజులుగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మాములుగానే హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు ఉంటాయి. ఇక వర్షం పడిందంటే రోడ్లపైనే గంటల తరబడి ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటన చేసింది. మెట్రో రైలు సేవలను ఈనెల 6 నుంచి మరో అరగంట పొడిగించనున్నట్లు తెలిపింది.

గతంలో మాదిరిగానే ఉదయం 7 గంటల నుంచి మెట్రో సేవలు ప్రారంభమవుతాయి. రాత్రి 10:45 గంటలకు ముగుస్తాయి. ప్రతిరోజు మూడు మార్గాల్లో 1,000 ట్రిప్పులను మెట్రో తిప్పుతోంది. మెట్రో రైలుతో నగర ప్రజలు ట్రాఫిక్​ నుంచి కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. ఉదయం కళాశాలలు, కార్యాలయాలకు వెళ్లేందుకు ఎక్కువగా నగర ప్రజలు మెట్రో సేవలనే వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సేవల పొడిగింపుతో నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొన్నిరోజుల పాటు కరోనా ఉధృతి నేపథ్యంలో మెట్రో సేవలు నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అన్ని కారిడార్‌లలో మెట్రోరైళ్లను పూర్తి స్థాయిలో నడుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement