Thursday, April 25, 2024

హైద‌రాబాద్ లో మ‌రో భారీ ప్లై ఓవ‌ర్ – ప్రారంభించిన కిష‌న్ రెడ్డి, కేటీఆర్

హైద‌రాబాద్ లో మ‌రో భారీ ప్లై ఓవ‌ర్ ను తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రారంభించింది. షేక్ పేట్ ప్లై ఓవ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. ఈ ప్లై ఓవ‌ర్ ని కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డితో క‌లిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నూత‌న సంవ‌త్స‌ర బ‌హుమ‌తిగా ఈ ప్లైఓవ‌ర్ ని ప్రారంభించిన‌ట్లు చెప్పారు. దాదాపు 350 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టోలిచౌకి రిలయన్స్ మార్ట్ నుంచి షేక్ పేట, రాయదుర్గం మల్కo వరకు అంటే దాదాపు 2.8 కిలోమీటర్ల మేరకు నిర్మాణం చేపట్టారు. దాదాపు మూడు కిలోమీటర్ల ఉంది ఈ ఫ్లై ఓవ‌ర్. హైదరాబాద్ నగరంలోని పొడవైన ఫ్లై ఓవర్ జాబితాలో చోటు సంపాదించుకుంది. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభం కారణంగా మెహదీపట్నం – హైటెక్ సిటీ మధ్య ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం పై హైదరాబాద్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement