Friday, April 19, 2024

Huzurabad: బహిరంగ సభలకు ఈసీ బ్రేక్

By Polls: హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో బహిరంగ సభలకు ఈసీ బ్రేక్ వేసింది. పక్క జిల్లాల్లో కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని తెలిపింది. దీంతో గులాబీ బాస్ సభ ఉంటుందా లేదా అనే సందిగ్దంలో పార్టీ శ్రేణులున్నాయి.

ఇదిలా ఉంటే రోడ్ షోలకు టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ప్లీనరీని హుజూరాబాద్‌ సభగా వాడుకునే అవకాశం కూడా ఉంది. ఇక సభలపై నిషేధ‌మంతా బీజేపీ కుట్ర అని విమర్శిస్తోంది టీఆర్ఎస్. కరీంనగర్, హన్మకొండ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది. ఇక్కడ భారీ బహిరంగసభలు నిర్వహించడానికి వీల్లేదని తెలిపింది ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌. దీంతో గులాబీ బాస్ కేసీఆర్ ప్రచారం రోడ్‌షోలకే పరిమితం కానున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement