Thursday, April 25, 2024

హుజురాబాద్ ఉప ఎన్నిక: కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన ఎప్పుడంటే..

హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించ లేదు. దీంతో హుజురాబాద్ లో ఎవరు బరిలో ఉంటారు? అన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఈ విషయంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందిచారు.

కాంగ్రెస్​ అభ్యర్థిని రెండ్రోజుల్లో ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక రెండ్రోజుల్లో ఉంటుందని తెలిపారు. హుజూరాబాద్​లో కలిసొచ్చే పార్టీల సహకారాన్ని తీసుకుంటామని చెప్పారు. తమ పార్టీకి ఓ వ్యూహం ఉందన్న రేవంత్… దాని ప్రకారమే ముందుకు వెళ్తామని చెప్పారు.

కాగా, కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొండా సురేఖ, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ పేర్లను పరిశీలించారు. ఈ ఇద్దరిలో ఒకరికి టికెట్ ఖరారు చేస్తారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డికి 60 వేల ఓట్లు సాధించారు.

ఇది కూడా చదవండి: హుజురాబాద్ బైపోల్: స్వరం పెంచిన ఈటల..

Advertisement

తాజా వార్తలు

Advertisement