Thursday, April 25, 2024

బ్రేకింగ్ః హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదా

హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదా పడింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కరోనా కారణంగా ఉపఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది. హుజురాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే ఇప్పట్లో ఈ రెండు నియోజకవర్గాలకు ఉపఎన్నికలు ఉండవని ఎన్నికల కమిషన్ తెలిపింది. అయితే మళ్లీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. కరోనా నేపథ్యంలో ఉప ఎన్నికను వాయిదా వేసినట్లు సీఈసీ పేర్కొంది. కాగా, మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్‌లో.. వైసీపీ ఎమ్మెల్యే హఠాత్తుగా మరణించడంతో బద్వేల్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది.

మరోవైపు ఈటల రాజేందర్‌ రాజీనామా ఆమోదం అనతరం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఉప ఎన్నిక కోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశాయి. టీఆర్ఎస్ తరుపున అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను రంగంలో దింపగా.. బీజేపీ తరుపున మాజీ మంత్రి ఈటల బరిలో ఉన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

హుజురాబాద్ ఉప ఎన్నికల వేళ సీఎం కేసీఆర్‌ ప్రకటించిన దళిత బంధు ప్రకటించారు. ఉప ఎన్నికలో ఈ పథకం తమకు అనుకులంగా మారుతుందని గులాబీ నేతలు భావించారు. ఈ పరిస్థితుల్లో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కొంత ఆలస్యంగా జరిగితే, అక్కడ రాజకీయంగా తమకు ప్రయోజనం కలుగుతుందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement