Friday, March 29, 2024

Crime: బంగారం విడిపించాలని అడిగితే హత్య.. భర్త చేతిలో భార్య హతం

కుదువ పెట్టిన బంగారం విడిపించాలని అడిగిన భార్యను దారుణంగా భర్త హతమార్చాడో భర్త. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో చోటు చేసుకుంది. మూడేళ్ల క్రితం సుందరగిరి రాజేష్ ఓదెల మండలం పోత్కపల్లి గ్రామానికి చెందిన రక్షితలు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా రక్షిత బంగారం గత కొన్ని రోజుల క్రితం రాజేష్ కుదవ పెట్టుకున్నాడు. త్వరలో రక్షిత సోదరి వివాహం ఉండడంతో బంగారం విడిపించాలని గత కొన్ని రోజులుగా రక్షిత భర్త రాజేష్ ను పదే పదే అడగడంతో సోమవారం తెల్లవారు జామున ఉన్న స్క్రూ డ్రైవర్ తో రక్షిత తలపై పోవడంతో పాటు తల దిండు తో దారుణంగా హతమార్చాడు. అనంతరం రెండేళ్ల బాబుతో రాజేష్ పరారయ్యాడు. మంగళవారం స్థానికుల సమాచారంతో గోదావరిఖని ఏసిపి గిరి ప్రసాద్, లక్ష్మీనారాయణ, ఎస్ఐ స్వరూప్ ప్రజల బృందం సంఘటన స్థలానికి రక్షిత మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement