Saturday, April 20, 2024

భ‌ర్త‌, పిల్లలున్నారు.. మ‌రో యువ‌కుడిని ప్రేమించింది.. తర్వాత ఏం జరిగిందంటే..

భర్తను, పిల్లల‌ను కాదనుకుంది ఓ వివాహిత.. తన ప్రియుడితో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన తెలంగాణ‌లోని కండ్లపల్లి అటవీప్రాంతంలో జ‌రిగింది. హైదరాబాద్ లోని బోరబండకు చెందిన వివాహిత (32) అదే ప్రాంతంలో నివసిస్తున్న యువకుడి (22)తో ఇల్లీగ‌ల్ ఎఫైర్‌ పెట్టుకుంది. వికారాబాద్ జిల్లాకు చెందిన ఆ యువకుడు, ఆమె ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. వారు ఒకరినొకరు విడిచి ఉండలేనంత దగ్గరయ్యారు.

అయితే ఇక తాము లీగ‌ల్‌గా క‌లిసి ఉండ‌లేమ‌నుకున్నారు.. పెళ్లి చేసుకుంటే ఆటంకాలు వస్తాయని భావించి ఆఫీస్ వర్క్ అయిపోయాక ఇద్దరూ కలిసి పూడూరు మండలం కండ్లపల్లి అటవీ ప్రాంతానికి వెళ్లారు. నీలగిరి తోటలో పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నారు. అక్క‌డ అప‌స్మార‌కంగా ప‌డి ఉన్న ఈ జంటను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళతో పాటు యువకుడిని చికిత్స నిమిత్తం వికారాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు, పోలీసులు తెలిపారు. మహిళ వివరాలు సేకరించి ఆమె భర్తకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement