Thursday, March 28, 2024

ఆ పనికోసం భర్త వేధింపులు.. చివరకు భార్య ఏం చేసిందంటే..

భర్త లైంగిక వేధింపులకు విసుగు చెందిన ఓ భార్య కఠిన నిర్ణయం తీసుకుంది. బలవంతంగా శృంగారం చేయమని పదే పదే వేధింపులకు గురిచేయడంతో చివరకు తనే భర్త ప్రాణాలు తీసింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విఠలాపూర్ లో జరిగింది. ఆ గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి ఈ కష్టం ఎదురైంది. దంపతులిద్దరూ వారికి ఉన్న ఒక్కగానొక్క కూతురును అదే గ్రామంలో ఉన్న వ్యక్తికి ఇచ్చి ఏడేళ్ల క్రితం పెళ్లి చేశారు. ఇక మిగిలింది ఆ ఇంట్లో ఆ వృద్ధ దంపతులు ఇద్దరు మాత్రమే..

కాగా, శారీరకంగా కలవాలంటూ తరచూ గొడవపడుతూ ఇష్టారీతిన తన భార్యను కొట్టేవాడు ఆ ఓల్డ్ మన్. ఇదే విషయంలో పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. వీరిద్దరికీ గ్రామస్తులు పలుమార్లు సర్దిచెప్పారు. అయినా వేధింపులు మానుకోని ఆ వ్యక్తి గత సోమవారం భార్యను మరింతగా వేధించడం మొదలు పెట్టాడు. అయితే భార్య దగ్గరికి రానివ్వక పోవడంతో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ గొడ్డలి కర్రతో కొట్టాడు.

ఆ తర్వాత బుధవారం రాత్రి మరోసారి లైంగికంగా వేధించాడు. ఈ క్రమంలో ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా చేసి భార్యపై గొడ్డలి కర్రతో విచక్షణ రహితంగా దాడి చేశాడు. భర్త హింసను భరించలేకపోయిన ఆ మహిళ అదే గొడ్డలితో భర్తను చంపేసింది. ఈ ఘటనతో స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయాడు. కూతురు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement