Sunday, March 17, 2024

హడలెత్తిస్తున్న కరోనా… భారీగా పెరుగుతున్న కేసులు.

(ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి) : కరోనా కేసులు వాయువేగంతో పెరుగుతున్నాయి. రోజు రోజుకు కొత్త కేసులు పెరుగుతుండటంతో భయాందోళనలు నెలకొన్నాయి. గతంలో మాదిరిగా ఈసారి కేసుల సంఖ్య పెరుగుతోంది. హైద్రాబాద్ చుట్టూరా ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పోటాపోటీగా కేసులు పెరుగుతున్నాయి. కొత్త సంవత్సర వేడుకల నుండి కరోనా వ్యాప్తి పెరుగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో నువ్వా నేనా అన్నట్లుగా కేసులు నమోదవుతున్నాయి.

తాజాగా సోమవారం రోజు రంగారెడ్డి జిల్లా పరిధిలో బాగా పెరిగాయి. ఒక్కరోజే ఏ కంగా 916 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలో 470 మందికి పాజిటివ్ వచ్చింది. నాన్ జీహెచ్ఎంసీ పరిధిలో 446 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ జిల్లాలో 176 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వికారాబాద్ జిల్లాలో కూడా కేసుల సంఖ్య గతంతో పోలిస్తే పెరుగుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం ఇబ్బందులు తప్పెట్లు కనిపించడం లేదు. కనీస అవగాహన లేకుండా తిరుగుతుండటం తోనే ఇబ్బందులు వస్తున్నాయి. కనీస జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న సూచనలు ఏ మాత్రం అమలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement