Thursday, April 25, 2024

మహారాష్ట్ర నుండి పార్టీలో చేరడమెలా అంటూ కవితకు ట్వీట్

ఈ మధ్యకాలంలో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుండి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. రాష్ట్రంలోనే కాకుండా దేశమంతటా తమ సత్తా చాటేందుకు పలు రాష్ట్రాల్లో మీటింగ్ లు పెట్టేందుకు సిద్దమై పలు చోట్ల సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మహారాష్ట్రలోని నాందేడ్ లో నిర్వహించిన భారీ మీటింగ్ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి అక్కడ కూడా ఆదరణ పెరుగుతోంది. ఈ సభకు పెద్ద సంఖ్యలో హాజరైన జనం, కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. ఈ మీటింగ్ తర్వాత బీఆర్ఎస్ లో చేరేందుకు చాలామంది రెడీ అయ్యారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

మహారాష్ట్ర నుంచి ఓ యువకుడు తెలంగాణ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ నేత కల్వకుంట్ల కవితకు ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ లో చేరాలని ఉంది.. అందుకు ఏం చేయాలో చెప్పాలంటూ ఆ ట్వీట్ లో కోరాడు. దీనికి ఎమ్మెల్సీ కవిత జవాబిస్తూ.. కాంటాక్ట్ డిటేల్స్‌ను నేరుగా పంపాల‌ని, బీఆర్ఎస్‌లో స్వాగ‌తించేందుకు సంతోషిస్తున్నామ‌ని ఎమ్మెల్సీ క‌విత త‌న ట్వీట్‌లో తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభలు, కార్యక్రమాల్లో పాల్గొని, సీఎం కేసీఆర్ కు మద్దతు పలకాలని సూచించారు. మరోవైపు, ఎమ్మెల్సీ కవిత ఈనెల 25న ముంబైలో పర్యటించున్నారు. ‘2024 ఎన్నికలు- విపక్షాల వ్యూహం’ అనే అంశంపై జరగనున్న చర్చలో కవిత పాల్గొంటారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన రైతుబంధు, దళిత బంధు, బీమా వంటి సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్సీ కవిత వివరిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement