Saturday, April 20, 2024

హోం మంత్రి సుచరితతో – ఎమ్మెల్యే రక్షణనిధి భేటీ

తిరువూరు రెవిన్యూ డివిజన్ పరిధిలోనే డిఎస్పి కార్యాలయం ఉండేలా చర్యలు చేపట్టాలని సచివాలయంలోని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ఛాంబ‌ర్ లో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందించారు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ. గత రెండు రోజుల క్రితం డిఎస్పి కార్యాలయం నందిగామలో ఏర్పాటు చేస్తున్నట్లు వచ్చిన ప్రకటన ఎంత మాత్రం ఆమోదయోగ్యంగా లేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు..తిరువూరు నుండి నందిగామ వెళ్లేందుకు 60 కిలోమీటర్ల పైగా ప్రయాణం ఎంత మాత్రం సబబు కాదన్నారు..పాలనాపరంగా నూతనంగా ప్రకటించిన తిరువూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుతోనే నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమని హోం మంత్రికి తెలిపారు ఎమ్మెల్యే రక్షణనిధి.. ఎమ్మెల్యే వెంట గంపలగూడెం మండల పార్టీ అధ్యక్షులు చావా వెంకటేశ్వరరావు, వైసిపి జిల్లా నాయకులు గోగులమూడి చెన్నకేశవరెడ్డి ఉన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement