Friday, March 29, 2024

Breaking : హైకోర్టు వ్యాఖ్య‌లు బాధాక‌రం – ఎమ్మెల్యే ధ‌ర్మాన‌

హైకోర్టు వ్యాఖ్య‌లు బాధ‌క‌లిగించాయ‌న్నారు వైసీపీ ఎమ్మెల్యే ధ‌ర్మాన ప్ర‌సాద్ రావు. రాజ్యాంగ ప్ర‌కార‌మే ఈ స‌భ ఏర్పాట‌యిందన్నారు. కాబ‌ట్టే విస్తృతంగా చ‌ర్చించాల్సిన అవ‌స‌రం వ‌చ్చింద‌న్నారు. రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ఎవ‌రో నిరోధిస్తే ఎలా అన్నారు. రాజ‌ధాని అంశం ఒక్క‌టే కాద‌ని..అసెంబ్లీకి ఉన్న అధికారాల సంగ‌తి ఏంట‌ని అన్నారు.ఇక ఎన్నిక‌లు ఎందుకు, ఈ ఖ‌ర్చంతా ఎందుకని ప్ర‌శ్నించారు.ప్ర‌జ‌లు ఓట్లు వేశారంటేనే గ‌త ప్ర‌భుత్వ విధానం బాగోలేద‌ని అర్థ‌మ‌న్నారు. గ‌త ప్ర‌భుత్వాల విధానాల‌ను మార్చొద్దు అంటే ..కొత్త ప్ర‌భుత్వాల‌ను ఎన్నుకోవ‌డం ఎందుక‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement