Saturday, April 20, 2024

కేటీఆర్ ట్వీట్ పై స్పందించిన స‌మంత‌..ఏమందో తెలుసా..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ పై స్పందించింది. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం అభినంద‌నీయ‌మ‌ని తెలిపింది. ఈ నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నట్లు… దండం పెట్టిన ఏమోజీని పెట్టి ట్వీట్‌ చేసింది సమంత. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ గా మారింది..వివ‌రాల్లోకి వెళ్తే.. రైతు చట్టాల రద్దుపై సీఎం కేసీఆర్‌… బీజేపీ సర్కార్‌ పై కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ చట్టాలపై చాలా ఆలస్యంగా కేంద్రం స్పందించిందని..రైతులపై దేశ ద్రోహ కేసులను కొట్టివేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే.. చనిపోయిన 750 మంది రైతులకు తెలంగాణ ప్రభుత్వం రూ.3 లక్షలు ఎక్స్‌ గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కూడా 750 మంది రైతులకు… ఒక్కక్కరికి.. రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు కేసీఆర్‌. సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్ పై స‌మంత స్పందించ‌డం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement