Tuesday, April 16, 2024

కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్ కి – భార‌త ప్ర‌తినిధిగా హీరోయిన్ పూజాహెగ్డే

కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్ కి భార‌త ప్ర‌తినిధిగా హీరోయిన్ పూజాహెగ్డే హాజ‌రు కానుంది. ఈ ఏడాది కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్ వేడు‌క‌లు మే నెల 17న మొద‌లు కానున్నాయి. ఈ నెల 28 వ‌ర‌కు కొన‌సాగ‌నున్న ఈ వేడుక‌ల్లో భార‌త ప్ర‌తినిధిగా పూజ హెగ్డే హాజ‌రుకానున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ద‌క్షిణాది చిత్రాల్లో స‌త్తా చాటుతున్న పూజ హెగ్డే… కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్ వేడుక‌ల‌కు ఈ ఏడాది తొలిసారి హాజరు కానుంది. అంటే… ఈ వేడుక‌ల‌కు తొలిసారి హాజ‌రవుతున్న స‌మ‌యంలోనే భార‌త దేశ ప్ర‌తినిధిగా వేడుక‌ల్లో ఆమె ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement