Thursday, April 25, 2024

15భాష‌ల్లో, 20వేల స్ర్కీన్ల‌పై సంద‌డి చేయ‌నున్న ‘ఆదిపురుష్’

బాహుబ‌లి చిత్రం నుండి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. ప‌లు భారీ ప్రాజెక్టులు ఆయ‌న చేతిలో ఉన్నాయి. రాధేశ్యామ్ చిత్రం రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ‘సలార్’ చేయనున్న ప్రభాస్.. రామాయణ కావ్యం ఆధారంగా ఓంరౌత్ తెరకెక్కించనున్న భారీ పురాణగాథ ‘ఆదిపురుష్’లో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. 15 భారతీయ భాషలతో పాటు వివిధ దేశాల భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 20 వేల స్క్రీన్లపై సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నార‌ట‌. రాముడిగా కనిపించనున్నాడు. సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఇప్పుడు ఆదిపురుష్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తవడంతో త్వరలోనే విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించినట్టు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement