Friday, April 26, 2024

18ఏళ్ల వివాహ‌బంధానికి ఫుల్ స్టాప్ – ఐశ్వ‌ర్య‌తో విడిపోతున్న‌ట్లు ధ‌నుష్ ట్వీట్

త‌మ 18ఏళ్ల వివాహ‌బంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు హీరో ధ‌నుష్. త‌న భార్య , త‌మిళ సూప‌ర్ స్టార్ కుమారై ఐశ్వ‌ర్య‌తో విడిపోతున్న‌ట్లు వెల్ల‌డించారు. 2004లో వీరి వివాహం జ‌రిగింది. 18 ఏళ్ల దాంపత్య బంధానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో తన భార్యతో విడిపోతున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు ధనుష్. ‘ మేం 18 సంవత్సరాల పాటు కలిసి ఉన్నాము. స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా , శ్రేయోభిలాషులుగా .. ఇలా ఎన్నో రకాలుగా కలిసి జీవించాం. కాని ఈరోజు ఐశ్వర్య , నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాము.

దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి . ఇన్ని రోజులు మాపై ఎంతటి ప్రేమాభిమానాలు చూపారో ఇప్పుడు కూడా మాకు అవసరమైన గోప్యతను అందించండి . ఓం నమశివాయ! ఇట్లు ప్రేమతో మీ ధనుష్’ అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు ధనుష్. కోలీవుడ్ లో ఎంతో క్రేజ్ ఉన్న హీరోల్లో ధనుష్ ఒకడు. సినిమా, సినిమాకు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ తన నటనతో ఎంతోమంది అభిమానులతో పాటు రెండు సార్లు జాతీయ అవార్డు అందుకున్నాడు. తెలుగులో కూడా అతనికి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే వెంకీ అట్లూరి దర్శకత్వంలో నేరుగా ‘సార్ ‘ సినిమాతో తెలుగు లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అదేవిధంగా శేఖర్ కమ్ముల ప్రాజెక్టుకు కూడా ఓకే చెప్పాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement