Thursday, April 25, 2024

ఉత్త‌మ న‌టుడిగా ధ‌నుష్ .. ప‌రిపూర్ణ గౌర‌వం అంటూ ఆనందం ..

బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో హీరో ధ‌నుష్ న‌టించిన అసుర‌న్ చిత్రానికి ఉత్త‌మ న‌టుడిగా పురస్కారాన్ని చేజిక్కించుకున్నాడు. కాగా రీసెంట్ గా గోవాలో ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా తో పాటు ఈ బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ కూడా జ‌ర‌గ‌డం విశేషం..అవార్డు అందుకున్న ధ‌నుష్ ఈ సంతోషకర విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘నాకు ఇది ఒక పరిపూర్ణ గౌరవం’ అని క్యాప్షన్‌ పెట్టాడు. దీంతో అభిమానులు, నెటిజన్ల నుంచి ధనుష్‌కు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ‘అసురన్‌’ సినిమాను తెలుగులో ‘నారప్ప’గా రీమేక్‌ చేసిన సంగతి తెలిసిందే. వెంకటేశ్‌, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement