Thursday, April 25, 2024

వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌థుర నుంచే పోటీ చేస్తా.. హేమమాలిని

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా తాను మ‌థుర నుంచే పోటీ చేస్తాన‌ని చెప్పారు బిజెపి ఎంపీ.. న‌టి హేమ మాలిని. ఇతర స్థానం నుంచి పోటీ చేయాలనే ప్రపోజల్ వస్తే, అది అంగీకారం కాదని స్పష్టం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి అధికారంలోకి వస్తుందని, నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలను చేపడతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. హేమమాలిని మథుర లోక్ సభ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు (2014, 2019) గెలుపొందారు. అంతకు ముందు ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. ఈసారి కూడా మథుర నుంచే పోటీ చేయాలని ఆమె భావిస్తున్నారు. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల గురించి, తాను పోటీ చేసే స్థానం గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement