Friday, March 29, 2024

ప్రమాద బాధితులకు హెల్ప్​ చేస్తే ఆర్థిక సాయం.. మెడల్స్​.. ప్రకటించిన సీఎం స్టాలిన్​

తమిళనాడు సర్కారు మరో వినూత్న పథకం అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు సీఎం ఎంకే స్టాలిన్​ ఈ వివరాలను ట్విట్టర్​ ద్వారా సోమవారం తెలియజేశారు. రోడ్డు ప్రమాద బాధితులకు వైద్య సదుపాయాలను అందించడంలో సహాయపడే వారికి నగదు పురస్కారం అందిస్తామన్నారు.

అంతేకాకుండా వారికి రివార్డులు, ధ్రువీకరణ పత్రాలు కూడా ఇస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న వారికి సహాయం చేసి, గోల్డెన్​ అవర్​ వ్యవధిలో వారికి వైద్యం అందేలా కృషి చేసిన వారికి ప్రశంసా పత్రంతో పాటు రూ.5వేల నగదు బహుమతి కూడా ఇస్తామని సీఎం తెలిపారు. ఈ మేరకు ఈ వివరాలన్నీ ఆయన ట్విట్టర్​లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement