Tuesday, April 16, 2024

స‌ముద్రంలో కూలిన హెలికాఫ్టర్ – ఈదుకుంటూ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డిన ‘మంత్రి’ ఎక్క‌డంటే

ప్ర‌మాద‌వ‌శాత్తు హెలికాఫ్ట‌ర్ కుప్ప‌కూలింది. దాంతో దాంట్లో ఉన్న మంత్రి స‌ముద్రంలో ప‌డ్డారు. కాగా ఆయ‌న 12గంట‌ల‌పాటు స‌ముద్రంలో ఈదుకుంటూ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. దాంతో తాను మ‌ర‌ణించ‌లేద‌ని బ‌తికే ఉన్న‌ట్లు తెలిపారు. ఈ సంఘ‌ట‌న మ‌డ‌గాస్క‌ర్ లో చోటు చేసుకుంది. ఐలాండ్ కు వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. కాగా మ‌డ‌గాస్క‌ర్ దేశ మంత్రి సెర్జ్ గెల్లె ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ఓ ప్రాంతంలో జరిగిన పడవ ప్రమాదంలో 39 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో పడవ మునిగిపోవడంతో ఆ ప్రదేశాన్ని పరిశీలించడానికి మంత్రి బృందం అక్కడికి వెళ్లింది. తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు హెలికాప్టర్ కుప్పకూలింది. హెలికాప్టర్ లో ఉన్న మంత్రితో పాటు మరో ఇద్దరు పోలీసులు కూడా ప్రాణాలతో బయటపడ్డారు.

కాగా ఈ విష‌యం తెలియ‌ని ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినా ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. హెలికాప్టర్ ప్రమాదంలో మంత్రితో పాటు మిగతా ఇద్దరు అధికారులు మరణించారని ఆయన నివాళుల‌ర్పించారు. ప్రమాదం జరిగిన తర్వాత తాను రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు సముద్రంలో ఈదుకుంటూ వచ్చినట్లు మంత్రి గేలె వివ‌రించారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. తనకు ఎలాంటి గాయాలు కాలేదని, సురక్షితంగా బతికే ఉన్నానని మహాంబో గ్రామస్తులకు చెప్పారు. ఆయన హెలికాప్టర్ లోని ఒక సీటును సముద్రం నీటిలో తేలడానికి ఉపయోగించుకున్నారని పోలీస్ చీఫ్ జఫిసంబత్రా రావోవీ పేర్కొన్నారు. ఆయన క్రీడల్లో ఎల్లప్పుడూ గొప్ప సామర్థ్యాన్ని ప్రదర్శించే వారిని, 30 ఏళ్ల వ్యక్తిలా బ్రతకడానికి పోరాడారని రావోవీ ప్రశంసించారు. అయితే ఈ ప్రమాదంలో చిక్కుకున్న ముగ్గురూ ఈదుకుంటూ విడివిడిగా సముద్ర తీర ప్రాంతమైన మహాంబోకు చేరుకున్నారు. హెలికాప్టర్ కూలి పోవడానికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement