Saturday, April 20, 2024

భారీ వర్షాల ఎఫెక్ట్‌.. బద్రీనాథ్‌ యాత్రకు బ్రేక్‌

ఉత్తరాఖండ్‌లో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. 13 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వానలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ఆయా జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. దీంతో బద్రీనాథ్‌ యాత్రకు బ్రేక్‌ పడింది. వర్షా ల కారణంగా యాత్రను పండుకేశ్వర్‌ వద్దే నిలిపివేస్తున్నట్లు చమోలి అధికార యంత్రాంగం వెల్లడించింది. వాతావరణశాఖ హెచ్చరికల దృష్ట్యా యాత్రికులంతా జోషిమఠ్‌, పాండుకేశ్వర్‌ వద్దే సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చమోలీ కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. స్థానికంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మరోవైపు పోలీసులు, విపత్తు నిర్వ#హణ బృందాలు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామీ ఆదేశాలు జారీ చేశారు. పౌరులు ఈ రెండు రోజులు ప్రయాణాలు వాయిదా వేసుకోవాని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement