Saturday, April 20, 2024

ఏపీ ప్రజలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు.. తెలుగులో ట్వీట్ చేసిన అమిత్ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏపీ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్ చేయడం విశేషం. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. అద్భుతమైన సంస్కృతి గొప్ప మనసున్న ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధి చెందింది. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ అమిత్ షా తెలుగులో ట్వీట్ చేయడం విశేషం. అలాగే నవంబర్ 1న అవతరణ దినోత్సవాలు జరుపుకుంటున్న వివిధ రాష్ట్రాలకు కూడా అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సీెం జగన్ కి .. ఏపీ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహిస్తోంది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోవత్సం సందర్భంగా పలువురు ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement