Thursday, April 25, 2024

హార్ట్ ఎటాక్..బైక్ పై క‌న్నుమూసిన యువ‌కుడు..

హార్ట్ ఎటాక్స్ ఈ మ‌ధ్య‌కాలంలో బాగా వినిపిస్తోన్న పేరు. ఆసుప‌త్రికి తీసుకువెళ్ళే స‌మ‌యం కూడా ఇవ్వ‌ట్లేదు. క్ష‌ణాల్లో మ‌నిషి క‌న్నుమూస్తున్న ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. కాగా రీసెంట్ గా అలాంటి ఓ సంఘ‌ట‌నే చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన యువకుడిని చికిత్స కోసం బైక్‌పై ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా… మధ్యలోనే ప్రాణాలు విడిచాడు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ షాకింగ్ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పండ్ల రాజు(26) అనే యువకుడు ఉన్నట్లుండి అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేయించుకున్నాడు. గుండెపోటు వచ్చినట్లు ఈసీజీలో డాక్టర్లు గుర్తించారు. మెడిసిన్ తీసుకున్న అనంతరం ఇంటికి వెళ్లిన రాజు విశ్రాంతి తీసుకోగా… మళ్లీ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతని ఫ్రెండ్ బైక్‌పై ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా… గాంధీ చౌరస్తా వద్ద అచేతనంగా బైక్‌పై నుంచి పడిపోయాడు. అప్రమత్తమై ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement