Thursday, April 18, 2024

Breaking: డ్రైవర్ కు గుండెపోటు.. 40మందికి తప్పిన ప్రమాదం..

బస్సు డ్రైవర్ కు ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో చనిపోయాడు. అయితే బస్సులో ఉన్న వారికి పెను ప్రమాదం తప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం వీరభద్రపురం దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది. అక్కడికక్కడే కుప్పకూలాడు. అయితే బస్సు పక్కనే పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ఉన్న 40మందికి ప్రమాదం తప్పింది. బస్సులోని యాత్రికులు ఏపీలోని కాణిపాకం వాసులు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement