Thursday, March 28, 2024

రాజ్‌భవన్‌లో పెండింగ్ బిల్లులపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిన పలు బిల్లులను గవర్నర్‌ సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో పెట్టడాన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజ్‌భవన్‌లో పెండింగ్ బిల్లులపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. గవర్నర్ తమిళిసై బిల్లులను ఆమోదించకపోవడాన్ని.. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం నేడు కౌంటర్ దాఖలు చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement