Wednesday, March 27, 2024

ప్రాణం తీసిన ఫొటో షూట్ : న‌వ‌జంట న‌దిలో…

ఓ న‌వ‌జంట ఫొటో షూట్ కోసం వెళ్లి న‌దిలో కొట్టుకుపోయిన ఘ‌ట‌న కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. సాహసోపేతమైన ‘పోస్ట్​ వెడ్డింగ్’​ షూట్​లు, ‘సేవ్​ ది డేట్’​ షూట్​లు క్రేజ్​గా మారిపోయాయి. ఇలాంటి కార్యక్రమాల్లో కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా కోజికోడ్​ సమీపంలోని కుట్టియాడికి చెందిన నవ జంట ఫొటో షూట్​ చేస్తూ నది ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ ప్రమాదంలో వరుడు మృతి చెందగా..వధువు పరిస్థితి విషమంగా ఉంది. కడియంగడ్‌కు చెందిన రెజిల్, కార్తీక మార్చి 14న వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత షూట్​కోసం కట్టియాడి నది వద్దకు వెళ్లారు. అక్కడ ఫొటోలు దిగుతుండగా.. ప్రమాదవశాత్తు నదీ ప్రవాహంలో చిక్కుకుపోయారు. వారి కేకలు విన్న స్థానికులు నదిలోకి దూకి ఇద్దిరినీ బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. వీరిలో రెజిల్​ మరణించగా.. కార్తీక పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement