రావణ దహనం కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. మంటలతో ఉన్న దిష్టిబొమ్మ నేలపై పడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన హర్యానాలో యమునా నగర్ లోచోటు చేసుకుంది. దసరా సందర్భంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో రావణ దహనం నిర్వహిస్తుంటారు. యమునానగర్ లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించారు. దీనిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఆ దిష్టిబొమ్మ సగం కాలిన తరువాత ఒక్క సారిగా కింద పడింది. దీంతో అక్కడున్న జనం ఒక్క సారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఏం జరిగిందో అర్థం కాక పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో అక్కడే రావణ దహనాన్ని చూస్తున్న పలువురికి గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారంతా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రావణ దహనంలో అపశృతి- నేలపై పడిన కాలుతున్న దిష్టిబొమ్మ-పలువురికి గాయాలు
Advertisement
తాజా వార్తలు
Advertisement