Friday, April 19, 2024

మ‌త మార్పిడికి పాల్ప‌డితే 10ఏళ్ల శిక్ష – బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన హ‌ర్యానా ప్ర‌భుత్వం

బలవంతపు మతమార్పిడులను నిరోధించేందుకు మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. హోం మంత్రి అనిల్ విజ్ దీనికి సంబంధించిన బిల్లును నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ‘హర్యానా ప్రివెన్షన్ ఆఫ్ అన్ లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ మత మార్పిడి బిల్లు- 2022’ బలవంతపు మత మార్పిడికి 10 సంవత్సరాల వరకు శిక్షను విధిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ చర్యను విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రశంసించింది. వీహెచ్‌పీ జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ సురేంద్ర జైన్‌ మాట్లాడుతూ.. ఈ బిల్లుతో రాష్ట్ర ప్రభుత్వం తన సత్తా చాటిందని అన్నారు. ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత రాష్ట్రంలో లవ్ జిహాద్, మతమార్పిడుల ద్వారా దేశంపై కుట్రలకు పాల్పడుతున్న కేసులు అరికట్టాలన్నారు. కాగా, హర్యానా మొదటి నుండి మతపరమైన ప్రాంతం. ఇది మానవ నాగరికత వర్ధిల్లిన ప్రాంతం. అయితే, రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా అక్రమ మతమార్పిడి కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ చట్టం అమలులోకి వచ్చిన తరువాత, సామాజిక సామరస్యం, శాంతి వాతావరణం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement