Friday, April 26, 2024

BJP VS TRS: బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు మంత్రి హరీష్ రావు సవాల్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. అన్ని వర్గాల ప్రజల నోట్లో మట్టి కొట్టి సిగ్గు లేకుండా పాదయాత్రలు చేస్తారా ? అంటూ మండిపడ్డారు. ఎందుకోసం పాదయాత్ర? అని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్ లు పెంచకుండా తొక్కి పెట్టినందుకా? అని ప్రశ్నించారు. వడ్ల కొననందుకా, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి నందుకా, వంట గ్యాస్ ధర మంట పెట్టినందుకా, నిరుద్యోగుల కు జాబ్ లు ఇవ్వనందుకా, ఎరువుల ధరలు విపరీతంగా పెంచినందుకా… ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో ముందు స్పష్టత ఇచ్చాకే పాదయాత్ర చేపట్టాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.

 అలా కాకుండా పాదయాత్రలు చేస్తే తెలంగాణ ప్రజలు దంచి కొడతారని హెచ్చరించారు. ప్రజల ఆకాంక్షల నుంచి వారి ఆశయ సాధన కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు.- బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కేసిఆర్ సారథ్యంలో రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతాం అని స్పష్టం చేశారు.- పెంచేటోడు బిజెపి వాడైతే… పంచే వారు టీఆర్ఎస్ పార్టీ అని పేర్కొన్నారు. – ఎవ్వరూ కావాలో…ప్రజలే తెల్చు కావాలని సూచించారు.

నంగునూరు మండలం నర్మేట గ్రామంలో EGS, CSR నిధులు రూ.2 కోట్ల రూపాయలతో నిర్మించిన పాడి పశువుల హాస్టల్, పాల సేకరణ కేంద్రంను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తన్నీరు హరీష్ రావు బీజేపీ నేతలపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. మట్టి పనుల్లో రూ.25 వేల కోట్ల రూపాయల కోత పెట్టిన కేంద్ర ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి నిలదీయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు EGS క్రింద EGS కూలీలకు 3 వేల కోట్ల పనిదినాలను తగ్గించడంపై కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు. కూలీలపై ప్రేమ ఉంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించినట్టు రాష్ట్రంలో పనిదినాలను 13 వేల కోట్ల నుండి 16 వేల కోట్ల కు పెంచేలా చూడాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement