Thursday, April 25, 2024

దిగుబడి ఎంత, ఆదాయం ఎంత.. ఆయిల్ పామ్ తోటల్లో హరీశ్ రావు..

అశ్వారావుపేట, ( ప్రభన్యూస్) : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పామాయిల్ తోటలను శనివారం పరిశీలించారు. పాకలగూడెం లోగల మాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ క్షేత్రంలోని అతిథి గృహంలో బస చేసిన ఆయన వ్యవసాయ క్షేత్రంను ఆసాంతం కలియతిరిగి పామాయిల్ తోటలను పరిశీలించారు.

ఈ సందర్బంగా పామాయిల్ తోటలు ఆయన పరిశీలించి పంట ఏయే సమయాల్లో సాగు చేయాలి ఎంత ఆదాయం వస్తుంది పంట దిగుబడి తదితర వివరాలను తుమ్మలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పామాయిల్ రైతులు, పలువురు ప్రజాప్రతినిధులు, తుమ్మల తనయుడు తుమ్మల యుగంధర్, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement