Thursday, April 25, 2024

స‌త్య‌దేవ్ తాజా చిత్రం గుర్తుందా శీతాకాలం – రిలీజ్ ఎప్పుడంటే

హీరో స‌త్య‌దేవ్ అంటేనే విభిన్న చిత్రాల‌కి పెట్టింది పేరు. ఆయ‌న గ‌త చిత్రాలు చూస్తే ఈ సంగ‌తి ఇట్టే తెలుస్తుంది. కాగా ఆయ‌న న‌టిస్తోన్న తాజా చిత్రం గుర్తుందా శీతాకాలం. ఈ రొమాంటిక్ డ్రామాను దర్శకుడు నాగశేఖర్ డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి పోస్టర్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేశారు. వాటికి ఆడియెన్స్ ను మంచి రెస్పాన్సే వచ్చింది. గతంలో రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. మరోవైపు మూవీ ఆడియోను కూడా సంగీత ప్రియులు ఇష్టపడుతున్నారు. ఇటీవల వరుస అప్డేట్స్ అందిస్తున్న మేకర్స్ తాజాగా మరో క్రేజీ అనౌన్స్ మెంట్ చేశారు. రెండేండ్ల కింద 2020 ఆగస్టులో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ కరోనా పరిస్థితుల కారణంగా కాస్తా ఆలస్యమైంది. వచ్చే నెల జూన్ లోనే ప్రపంచ వ్యాప్తంగా ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాన్ని థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కానీ జూన్ లో పక్కా డేట్ చెప్పలేదు. మరోసారి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ అప్డేట్ తో సత్యదేవ్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తమన్నా , మేఘా ఆకాష్, కావ్య శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement