Wednesday, April 24, 2024

Gujarath Floods-43మంది మృతి-ఆరుగురిని ర‌క్షించిన ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు

వారం రోజుల నుంచి గుజ‌రాత్ లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దాంతో ప‌లు ప్రాంతాలు నీట మునిగాయి. ఆస్తి, ప్రాణ న‌ష్టం అధికంగానే జ‌రిగింద‌ని రిపోర్టులు తెలియ‌జేస్తున్నాయి. గుజరాత్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా 43 మంది ప్రాణాలు కోల్పోయార‌ని అధికార గ‌ణాంకాలు తెలిపాయి. ఎనిమిది జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అంతేకాకుండా, వరదల కారణంగా 27 స్టేట్ హైవే మార్గాలు కూడా మూసివేయబడ్డాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇప్ప‌టికీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గుజరాత్ లోని ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించిన ప్రాంతాల్లో అజునాగర్, గిర్, భావనగర్, వల్సాద్, సూరత్, తాపీ, డాంగ్, నవ్‌సారిలున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఇప్ప‌టికే పెద్ద‌మొత్తంలో వ‌ర‌ద నీరు ముంచెత్తింది. నివాసితులు సురక్షితమైన ప్రదేశానికి వెళ్లేందుకు మోకాళ్ల లోతు నీటిలో క‌దులుతున్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి..

ఈ ప్రాంతాల్లోని రెండు డ్యామ్‌లలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో నవ్‌సారి చుట్టుపక్కల నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. అంతేకాకుండా, వీలైనంత ఎక్కువ మంది పౌరులను రక్షించడానికి తీర రక్షక దళం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ప‌రిస్థితులు మ‌రింత దారుణంగా మారుతున్న క్ర‌మంలో అధికారులు 27 రాష్ట్ర రహదారుల రాక‌పోక‌ల‌ను బంద్ చేశారు. నవ్‌సారిలో వరదల కారణంగా 18,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. వ‌ర‌ద‌ల కార‌ణంగా రాష్ట్రంలో పెద్ద‌మొత్తంలో ఆస్తి, ప్రాణ‌న‌ష్టం సంభ‌వించింది. ఈ ప్రాంతాల్లో సర్వే పూర్తయిన తర్వాత నష్టపోయిన వారందరికీ పరిహారం అందజేస్తామని గుజరాత్ ప్రభుత్వం పౌరులకు హామీ ఇచ్చింది.ఈ ఏడాదిలో ఇప్ప‌టివ‌ర‌కు సాధార‌ణం కంటే అధికంగానే వ‌ర్షాలు ప‌డ్డాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. రుతుప‌వ‌నాల ప్రారంభం త‌ర్వాతి నుంచి ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రాష్ట్రంలో వర్షాల కారణంగా 43 మంది ప్రాణాలు కోల్పోయారు.దినేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(NDRF), తీర రక్షక దళం కావేరీ డ్యాం దగ్గర చిక్కుకున్న ఆరుగురిని ర‌క్షించి సుర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement