Thursday, April 18, 2024

Big Breaking | దంచికొట్టిన గుజరాత్​​.. చెన్నై టార్గెట్​ ఎంతంటే

ఐపీఎల్​ ఫైనల్స్​లో గుజరాత్​ టైటాన్స్​ దంచికొట్టింది. తొలుత పది ఓవర్లలోపు పించ్​ హిట్టర్​ శుభ్​మన్​ గిల్​ (39) పరుగుల వద్ద పెవిలిచన్​ పంపిన చెన్నై బౌలర్లు.. ఆ తర్వాత వృద్ధిమాన్​ సాహా (54)ని కూడా నిలువరించారు. అయితే.. థర్డ్​ వికెట్​గా వచ్చిన సాయి సుదర్శన్​ (96) ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. 19వ ఓవర్​లో వరుసగా రెండు సిక్స్​లు బాది మూడో బంతికి ఎల్​బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ క్రమంలో గుజరాత్​ జట్టు మంచి స్కోరు చేయగలిగింది. నిర్ణీత ఓవర్లలో గుజరాత్​ జట్టు నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 214 పరుగులు చేయగలిగింది. ఇక చెన్నై సూపర్​కింగ్స్​ ముందు 215 పరుగుల టార్గెట్​ ఉంది. టార్గెట్​ చేజింగ్​ కోసం మరికొద్ది సేపట్లో ధోనీ సేన బ్యాటింగ్​కు దిగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement