Saturday, April 20, 2024

Breaking: మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంలో GST సోదాలు..

మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంలో జీఎస్టీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పుష్ప , శ్రీమంతుడు, సర్కార్ వారి పాట , రంగస్థలం, జనతా గ్యారేజ్ మూవీలకు నిర్మాణ సంస్థగా మైత్రి మూవీ మేకర్స్ పనిచేసింది. పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్, చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ తో వీరసింహారెడ్డి చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

 ఏకంగా 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయాలపై ఈ సోదాలు కొనసాగుతున్నాయి. రవిశంకర్‌, నవీన్‌ ఎర్నేని, మోహన్ ఇళ్లలో కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నవీన్ యేర్నేని, వై. రవి శంకర్, చేకూరి మోహన్‌ స్థాపించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement